Asianet News TeluguAsianet News Telugu

నేడు శ్రీ బాలా త్రిపుర సుంద‌రీ దేవిగా విజయవాడ దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

విజయవాడ :  దసరా శరన్నవరాత్రి వేడుకలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా కొనసాగుతున్నాయి. 

విజయవాడ :  దసరా శరన్నవరాత్రి వేడుకలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి వేడుకల్లో రెండోరోజయిన ఇవాళ కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శమిస్తున్నారు. బాలాత్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు తమ పిల్లాపాపలతో భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేసారు. నవరాత్రి వేడుకల కోసం ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేసారు.