Asianet News TeluguAsianet News Telugu

ఘోరం : ఆగి ఉన్న లారీని ఢీకొట్టి కారు తుక్కు.. ఇద్దరి మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రణస్గలం మండలం కోస్ట గ్రామసమీపంలోని 16వ జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని తెల్లవారుజామున వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరిని శ్రీకాకుళం జిల్లా, చిన్న నారాయణపురానికి చెందిన మోడీయా ఢిల్లీశ్వరరావు, మోడియా వసంతగా గుర్తించారు.