Asianet News TeluguAsianet News Telugu

జగన్ రాజారెడ్డి పాలనలో దళిత మహిళలకు రక్షణ లేదు ..నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...ట్వీట్ చేస్తూ గోల్డ్ మెడల్ సాధించి డాక్టర్ అయిన ఒక దళిత బిడ్డ పై వైకాపా గుండాల దాష్టికంతో   దళిత బిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని  వైకాపా నాయకుల అవినీతికి సహకరించలేదని దళిత మహిళా డాక్టర్ అనితా రాణి గారిని వేధించడం దారుణం అని అన్నారు .

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...ట్వీట్ చేస్తూ గోల్డ్ మెడల్ సాధించి డాక్టర్ అయిన ఒక దళిత బిడ్డ పై వైకాపా గుండాల దాష్టికంతో   దళిత బిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని  వైకాపా నాయకుల అవినీతికి సహకరించలేదని దళిత మహిళా డాక్టర్ అనితా రాణి గారిని వేధించడం దారుణం అని అన్నారు .జగన్ గారూ! మీ దిశ చట్టం దిశ తప్పిందా? అన్యాయం జరిగింది అంటూ ఒక దళిత చెల్లెలు పోలీస్ స్టేషన్ కి వెళితే దిశ చట్టం నిందితులకు కొమ్ముకాయడం ఘోరం అని ,చిత్తూరు జిల్లా పెనుమూరు ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఈ ఘటన పై సమగ్ర విచారణ జరపాలి. నిజాయితీగా వృత్తి ధర్మానికి కట్టుబడినందుకు బూతులు తిడుతూ,ఫోటోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలి అన్నారు .