Asianet News TeluguAsianet News Telugu

రిజర్వేషన్ల ఎత్తివేత:విశాఖలో దళిత సంఘాల నిరసన

కేంధ్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విశాఖలో దళిత సంఘాల ఐక్యవేదిక ర్యాలీ చేపట్టింది.

కేంధ్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విశాఖలో దళిత సంఘాల ఐక్యవేదిక ర్యాలీ చేపట్టింది.ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పలు ప్రాంతాల మీదుగా ఈ ర్యాలీ కొసాగింది.దేశంలో దళితుల హక్కులను కలరాసేలా కేంద్ర ప్రభుత్వం తీరును దళిత సంఘం నేతలు ఎండగట్టారు.రాజ్యాంగంలో దళితులకు సామాజిక హక్కుల కోసం కేటాయించిన రిజర్వేషన్లు సైతం పక్కన పెట్టాలనే యోచనలో ఉన్న కేంధ్ర ప్రభుత్వ తీరుపై దళిత సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై కేంధ్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.