Asianet News TeluguAsianet News Telugu

ఏం పీక్కుంటావో పీక్కో పో..: ప్రజా ప్రతినిధితో దాచేపల్లి ఎమ్మార్వో దురుసు ప్రవర్తన

దాచేపల్లి : అతడు ప్రజా ప్రతినిధి మాత్రమే కాదు అధికార పార్టీ నాయకుడు కూడా. ఎంతో పలుకుబడి కలిగిన ఆయన కనీసం ఎమ్మార్వో ఆఫీస్ లో చిన్న పని చేయించుకోలేకపోయాడు.

దాచేపల్లి : అతడు ప్రజా ప్రతినిధి మాత్రమే కాదు అధికార పార్టీ నాయకుడు కూడా. ఎంతో పలుకుబడి కలిగిన ఆయన కనీసం ఎమ్మార్వో ఆఫీస్ లో చిన్న పని చేయించుకోలేకపోయాడు. చివరకు ఎమ్మార్వో ఏం పీక్కుంటావో పీక్కో అంటూ సదరు నాయకున్ని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. ఇలా పల్నాడు జిల్లా దాచేపల్లి వైస్ ఎంపిపి కందుల జాన్ అధికార పార్టీలో వుండి కూడా ఎమ్మార్వో చేత తిట్లు తిన్నాడు. 

వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాల అప్ డేట్ కోసం దాచేపల్లి వైస్ ఎంపిపి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. రెండ్రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరిగినా పని కాకపోవడంతో విసుగుచెందిన ఆయన ఎమ్మార్వో ప్రవీణ్ ను కలిసాడు. కంప్యూటర్ ఆపరేటర్ రాకపోవడంతో పని చేయలేమని తహసీల్దార్ చెప్పాడు. ఈ క్రమంలోనే ఎంపిపి, ఎమ్మార్వోకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వైస్ ఎంపిపి పై సీరియస్ అయిన ఎమ్మార్వో ఏం పీక్కుంటావో పీక్కో పో అంటూ దుర్భాషలాడాడు.