Asianet News TeluguAsianet News Telugu

ఫార్మా కంపెనీలో విద్యుత్ షాక్... కాంట్రాక్ట్ కార్మికుడు మృతి...

విశాఖ జిల్లా పరవాడ మండలం ఫార్మా సెజ్ లో విద్యుత్ షాక్ తగిలి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు.

విశాఖ జిల్లా పరవాడ మండలం ఫార్మా సెజ్ లో విద్యుత్ షాక్ తగిలి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు.జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ సెజ్ ప్రాంతంలో ఉన్న నాట్కో ఫార్మా కంపెనీకి విద్యుత్ తీగలు లాగే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి కుండ్రపు రోహిణిరావు (47) అనే దినసరి కూలీ మృతి చెందాడు. సెజ్ లో ఉన్న నాట్కో కంపెనీకి 220 కేవి నుండి విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడానికి పయనీర్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా మంగళవారం విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. మృతినిది కసింకోట మండలం ,కన్నురుపాలెం గ్రామం. మృతదేహాన్ని రాంకీ ప్రాథమిక వైద్యానికి తరలించి అక్కడ నుండి ఎన్టీఆర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.