Asianet News TeluguAsianet News Telugu

కర్నూలు ఆసుపత్రి నుంచి కరోనా పాజిటివ్ మహిళ పరారీ..

కర్నూలు లోని కోవిడ్-19 ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ చికిత్స పొందుతున్న ఓ మహిళ పారిపోయింది.

కర్నూలు లోని కోవిడ్-19 ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ చికిత్స పొందుతున్న ఓ మహిళ పారిపోయింది. ఏకంగా ఆసుపత్రి సిబ్బందికి టోకరా కొట్టి మరీ పరారయ్యింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆసుపత్రి  సిబ్బంది హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టారు. కోడుమూరు మండలం ప్యాలకుర్తి దగ్గర ఆదోని కి చెందిన ఆర్ టిసి డిపో బస్సులో  వెళ్తున్న మహిళను గుర్తించారు. ఆమెను 108 లో ఆస్పత్రికి తరలించారు.

Video Top Stories