కర్నూలు ఆసుపత్రి నుంచి కరోనా పాజిటివ్ మహిళ పరారీ..
కర్నూలు లోని కోవిడ్-19 ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ చికిత్స పొందుతున్న ఓ మహిళ పారిపోయింది.
కర్నూలు లోని కోవిడ్-19 ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ చికిత్స పొందుతున్న ఓ మహిళ పారిపోయింది. ఏకంగా ఆసుపత్రి సిబ్బందికి టోకరా కొట్టి మరీ పరారయ్యింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టారు. కోడుమూరు మండలం ప్యాలకుర్తి దగ్గర ఆదోని కి చెందిన ఆర్ టిసి డిపో బస్సులో వెళ్తున్న మహిళను గుర్తించారు. ఆమెను 108 లో ఆస్పత్రికి తరలించారు.