ఏపీలో మద్యం కిక్కు: మందుబాబుల బారులు (వీడియో)
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సోమవారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సోమవారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మందుబాబులు తెల్లవారు జామునుండే వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. నెల్లూరు, తూళ్లూరు, కృష్ణాజిల్లాలోని గంపలగూడెం, మొగల్రాజపురం, ఊటుకూరుల్లో ఉన్న మద్యం షాప్ ల ముందు మద్యం ప్రియులు బారులు తీరారు. కరోనాను కూడా లెక్క చేయడం లేదు. దుకాణం తెరవకముందే కరోనాను సైతం లెక్కచేయకుండా మందుకోసం ఎగబడుతున్నారు. కంటైన్మెంట్ జోన్ లు మినహా మిగతా చోట్ల మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.