Asianet News TeluguAsianet News Telugu

భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టిన కరోనా వైరస్

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలోని ములుగుందం గ్రామంలో నివాసం ఉంటున్న శ్యామల భర్త నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సిమెంట్ ఫ్యాక్టరీ లో డ్రైవర్ పనిచేస్తున్నాడు. 

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలోని ములుగుందం గ్రామంలో నివాసం ఉంటున్న శ్యామల భర్త నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సిమెంట్ ఫ్యాక్టరీ లో డ్రైవర్ పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఆంజనేయులు రెండు రోజుల క్రితం ములుగుందం గ్రామానికి వచ్చాడు. అయితే శ్యామల భర్తను కరోనాటెస్టులు చేయించుకోనిదే ఇంట్లోకి అడుగుపెట్టొద్దని పంతం పట్టడంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. చివరికి భర్తను నచ్చజెప్పి ఆదోనిలో ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకోచ్చింది.  వైద్యులు టెస్ట్ చేసి ఆదోనిలోని 100 పడకల ఐషోలేషన్ వార్డు కు తరలించారు.