Asianet News TeluguAsianet News Telugu

కారు యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్..

కర్నూలు జిల్లాలో కారు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. 

కర్నూలు జిల్లాలో కారు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. కర్నూలు నుండి ఆళ్లగడ్డకు కారులో వెళ్తూ నంద్యాల సమీపంలోని శాంతిరామ్ ఆసుపత్రి వద్ద కారు టైర్ పగిలి జరిగిన ప్రమాదంలో 65యేళ్ల వ్యక్తి, అతని భార్య, ఇద్దరు బంధువులకు గాయాలయ్యాయి. అయితే ఆ వ్యక్తికి తీవ్రగాయాలవ్వడంతో కొలుకోలేక మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కరోనా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో సహాయ పడిన హైవే పోలీసులు, వైద్య సిబ్బంది, మృతదేహాన్ని తరలించేందుకు సహాయ పడిన బంధువులు, వైద్య సిబ్బంది ఆందోళనలో ఉన్నారు.