Asianet News TeluguAsianet News Telugu

సహనం కోల్పోయిన జనం: పోలీసులపై రాళ్లదాడి, ఏపీ-తెలంగాణ బోర్డర్‌లో యుద్ధం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎపీ, తెలంగాణ సరిహద్దులో వివాదం ముదిరింది. గుంటూరు సరిహద్దులోని దాచేపల్లి చెక్ పస్టు వద్ద బుధవారం రాత్రి నుంచి కొంత మంది వేచి ఉన్నారు. తెలంగాణ నుంచి ఆంద్రప్రదేశ్ లోని తమ స్వగ్రామాలకు వెళ్లడానికి వారు నిరీక్షిస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావడానికి సిద్ధమైనవారికి సంబంధించి గురువారం సాయంత్రం వైఎస్ జగన్ ప్రకటన చేశారు. ఆ తర్వాత పోలీసులకు, వారికి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులపైకి ఏపీ వాసులు రాళ్లు రువ్వారు.