కృష్ణా జిల్లాలో కరోనా కలకలం... ఒకే గ్రామంలో ముగ్గురికి కరోనా
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో కరోనా కలకలం మొదలయ్యింది.
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో కరోనా కలకలం మొదలయ్యింది. నిన్న(ఆదివారం) ఒక్కరోజే ముగ్గురు గ్రామస్తులు కరోనాబారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు గ్రామస్తులందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే స్వచ్చందంగా ముందుకు వచ్చి టెస్టు చేయించుకోవాలని స్థానిక తహసిల్దార్ సూచించారు.