దారుణం... భార్య ఎదుటే భర్తను చితకబాదిన పోలీసులు
గన్నవరం: భార్య భర్తలు చిన్నచిన్న గొడవలతో పోలీస్ స్టేషన్ కు వస్తే వారికి నచ్చజెప్పి కలపాల్సిన పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారు.
గన్నవరం: భార్య భర్తలు చిన్నచిన్న గొడవలతో పోలీస్ స్టేషన్ కు వస్తే వారికి నచ్చజెప్పి కలపాల్సిన పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. భార్య భర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించి భర్తను చితక్కొట్టారు. ఈ ఘటన గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోచోటుచేసుకుంది. భార్యాభర్తలకు నచ్చచెప్పి కాపురానికి పంపించాల్సిన పోలీసులే విడిపోయేలా వ్యవహరించటం సరికాదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అంబేద్కర్) రాష్ట్ర మహిళా ఆధ్యక్షురాలు జంగా గ్రేస్ మణి ఆరోపించారు. గొడవకు కారణాలను ఇరువురిని అడిగి తీసుకోకుండా కేవలం భర్త పైనే చర్యలు తీసుకోవటం చట్ట విరుద్ధమన్నారు. ఎస్సై పురుషోత్తం తీరును ప్రశ్నించిన తమ పార్టీ యువ నేతను కూడా దుర్బాష లాడటం, దూషించటం సరికాదన్నారు గ్రేస్ మణి.