Asianet News TeluguAsianet News Telugu

నడిరోడ్డుపైనే... మదనపల్లిలో ఇద్దరు కానిస్టేబుల్లు బాహాబాహీ

చిత్తూరు: కరోనా కట్టడికి కర్ఫ్యూ కొనసాగుతున్న సమయంలో ప్రజలను కట్టడి చేయాల్సిన పోలీసులే బాహాబాహీకి దిగిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

చిత్తూరు: కరోనా కట్టడికి కర్ఫ్యూ కొనసాగుతున్న సమయంలో ప్రజలను కట్టడి చేయాల్సిన పోలీసులే బాహాబాహీకి దిగిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారీకేడ్లు తీయాలని అటవీ కానిస్టేబుల్, తీసేదిలేదంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుబట్టడం గొడవకు దారితీసింది. ఈ ఘటన మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. బస్టాండు నుంచి బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన కంచె తొలగించాలని అటవీశాఖ ఇన్-చార్జ్ ఎఫ్ బి వో రామయ్య విధులలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ జగదీష్ ను బతిమలాడాడు. అయినా విధులలో ఉన్న కానిస్టేబుల్ అసభ్యంగా మాట్లాడుతూ.. అందరూ చూస్తుండగానే రామయ్య దాడికి యత్నించాడు. చేసేదిలేక అటవీశాఖ కానిస్టేబుల్ వెనక్కు వెళ్లి పోయాడు.

Video Top Stories