Asianet News TeluguAsianet News Telugu

గంజాయి కోటగా మారిన ఎస్ కోట.. కాలేజీ యువతను అడ్డుపెట్టుకుని యదేచ్ఛగా స్మగ్లింగ్..

విజయనగరం జిల్లా శృంగవరపుకోట పూర్తిగా గంజాయి కోటగా మారింది. 

విజయనగరం జిల్లా శృంగవరపుకోట పూర్తిగా గంజాయి కోటగా మారింది. విశాఖకు ఏజన్సీ ముఖద్వారం కావటంతో నిత్యం మన్యంలో సాగుచేస్తున్న గంజాయి పంటకు ఎస్ కోటను అడ్డాగా మార్చుకున్నారు. కాలేజీ యువతను అడ్డం పెట్టుకుని ఈ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ యువత ఇటువంటి రవాణాలకు పాల్పడి వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఒక్క వారంలోనే నాలుగు సార్లు, వందలకేజీల గంజాయిని వివిధ వాహనాల్లో తరలిస్తూ యువత పట్టుబట్టారు. అయినా వీరి ఆగడాలు ఆగటం లేదు. పిల్లల భవిష్యత్తు పాడవుతుందని తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని శృంగవరపుకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. 

Video Top Stories