Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో రంజాన్ ప్రార్థనలు ఇళ్లల్లోనే.. తేల్చేసిన జగన్

జిల్లా కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

జిల్లా కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇళ్లల్లోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయని, ఈ రంజాన్‌మాసంలో మీరంతా కూడా సహకరించి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని మీ అందర్నీ అభ్యర్థిస్తున్నానన్నారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పండంటూ ముస్లిం మత పెద్దలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఇది మనసుకు కష్టమైన మాట అయినా సరే.. చెప్పక తప్పని పరిస్థితి అని జగన్ అన్నారు. 

Video Top Stories