Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ: భవానీపురంలో ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్య (వీడియో)

విజయవాడలో ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్యకు గురైంది. భవానీపురానికి చెందిన మువ్వ ద్వారక ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పక్కింట్లోనే  చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్‌ సాయంతో పాప ఆచూకీ కోసం గాలించడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో ద్వారక ఇంటిపక్కన నివసిస్తున్న మేకల ప్రకాశ్ ప్రవర్తన స్థానికులకు, పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. అటు తన భర్తపై అనుమానంతో ఇంట్లో ఉన్న గోనెసంచెను చింపగా అందులో బాలిక మృతదేహం బయటపడింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడు ప్రకాశ్‌కు దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

విజయవాడలో ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్యకు గురైంది. భవానీపురానికి చెందిన మువ్వ ద్వారక ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పక్కింట్లోనే  చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్‌ సాయంతో పాప ఆచూకీ కోసం గాలించడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో ద్వారక ఇంటిపక్కన నివసిస్తున్న మేకల ప్రకాశ్ ప్రవర్తన స్థానికులకు, పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. అటు తన భర్తపై అనుమానంతో ఇంట్లో ఉన్న గోనెసంచెను చింపగా అందులో బాలిక మృతదేహం బయటపడింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడు ప్రకాశ్‌కు దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.