Asianet News TeluguAsianet News Telugu

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం... దూకుడు పెంచిన సీఐడి

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం లో సిఐడి దూకుడు పెంచింది. 

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం లో సిఐడి దూకుడు పెంచింది. ఇవాళ(గురువారం)తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో సిఐడి అధికారులు  రైతులను విచారిస్తున్నారు. గతంలో భయపెట్టి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన అంశం పై ఆరా తీస్తున్నారు. తాడికొండ నియోజకవర్గంలోని రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం లోని పలువురు రైతులను పోలీస్ స్టేషన్ కు పిలిపించుకున్న సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే రైతుల స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేసుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుకు కొనసాగుంపుగా రాజధానిలోని మిగిలిన ప్రాంతాలపై కూడా దృష్టి సారించింది సిఐడి.

Video Top Stories