Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో క్రిస్టియన్ మాఫియా అరాచకం..: సునీల్ దేవదర్ సంచలనం


అమరావతి: పవిత్ర హిందూ దేవుళ్ళు వెలిసిన చోటిని క్రిస్టియన్ మాఫియా అక్రమంగా శిలువను నిర్మిస్తోందని ఏపీ బిజెపి ఇంచార్జి సునీల్ దియోదర్ ఆరోపించారు.


అమరావతి: పవిత్ర హిందూ దేవుళ్ళు వెలిసిన చోటిని క్రిస్టియన్ మాఫియా అక్రమంగా శిలువను నిర్మిస్తోందని ఏపీ బిజెపి ఇంచార్జి సునీల్ దియోదర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడులో సీతమ్మ పాదాలు, లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం వెలిసిన చోట ఇలా క్రిస్టియన్ శిలువను ఏర్పాటుచేశారని... ఇది రాష్ట్ర పాలకుల వైఫల్యమేనని సునీల్ మండిపడ్డారు. దీనిపై రాష్ట్ర బిజెపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగినా పట్టించుకోకుండా ప్రభుత్వం సదరు క్రిస్టియన్ మాఫియాకే సపోర్ట్ చేస్తోందని మండిపడ్డారు.