Asianet News TeluguAsianet News Telugu

మంత్రం వేస్తే.. వెయ్యి రెండు వేలవుతుందని టోకరా..

గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లి గ్రామంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. 

గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లి గ్రామంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. మంత్రాలతో నోట్లు రెట్టింపు అవుతాయని ప్రజలను మోసంచేసి18 లక్షల రూపాయలు కొట్టేసిన కోట్ల హరికృష్ణ, బోగిరి శివాజీ,దిలీప్, ఉదయ్ కుమార్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 500వందలకు వెయ్యి, వెయ్యికి రెండువేలు అనగానే చదువుకున్నవాళ్లు కూడా ఎగబడ్డారని dsp శ్రీనివాసరావు చెబుతున్నారు. చివరకు మోసం బైట పడడంతో  వారి వద్ద నుండి 2లక్షలనగదు,15సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు.