Asianet News TeluguAsianet News Telugu

బెజవాడ టిడిపిలో అంతర్గత కుమ్ములాటలు... చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే మున్సిపల్ మరియు కార్పోరేషన్ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే మున్సిపల్ మరియు కార్పోరేషన్ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికే విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న ఆయన కృష్ణా జిల్లాలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం విశాఖ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు ఆ నియోజకవర్గ ఇంచార్జ్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు,  కోఆర్డినేటర్ కోనేరు నాగేంద్ర కుమార్(నాని), తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు మూల్పూరి సాయి కల్యాణి, గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు బొడ్డపాటి రాంబాబు, తెలుగు యువత నాయకులు మండవ అన్వేష్, బడుగు కార్తీక్, నాగ ప్రసాద్ తదితరులు ఘన స్వాగతం పలికారు. 
 

Video Top Stories