Asianet News TeluguAsianet News Telugu

రోజా వాహనానికి అడ్డుపడిన మహిళలు, రైతులు

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాకు మంగళగిరిలో  అమరావతి నిరసన సెగ తగిలింది.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాకు మంగళగిరిలో  అమరావతి నిరసన సెగ తగిలింది. నీరుకొండ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం సమ్మిట్ లో పాల్గొనేందుకు గురువారం వచ్చిన రోజాను మహిళలు, రైతులు అడ్డుకున్నారు. ఆమె వాహనం ముందు బైఠాయించి నినాదాలు 
చేశారు. అమరావతికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం వెలుపల కూడా మహిళలు, రైతులు ఆందోళనకు దిగారు. దీంతో కార్యక్రమం మధ్యలోనే వర్సిటీ సిబ్బంది సహాయంతో రోజా అక్కడినుండి వెళ్లిపోయారు.