150వ రోజుకు అమరావతి దీక్షలు.. ఇళ్లల్లోనే 12 గంటల నిరాహారదీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న దీక్షలు నేటికి 150 రోజుకు చేరుకున్నది. కరోనా నేపథ్యంలో తమ తమ ఇళ్లలోనే ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న దీక్షలు నేటికి 150 రోజుకు చేరుకున్నది. కరోనా నేపథ్యంలో తమ తమ ఇళ్లలోనే ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. 150 రోజు సందర్భంగా ఉదయం 8 గంటలనుండి రాత్రి 8 గంటల వరకు నిరాహారదీక్ష చేపట్టాలని అమరావతి జేఏసీ పిలుపు నిచ్చింది. తమ తమ ఇళ్ళలో మాత్రమే నిరసన తెలపాలని కోరింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులు, వలస కార్మికుల మృతికి నివాళులు తెలపాలని కూడా జేఏసీ కోరింది.