Asianet News TeluguAsianet News Telugu

విశాఖ గ్యాస్ లీకేజీ : జగన్ ను మెచ్చుకున్న కన్నా లక్ష్మీ నారాయణ.. ఎందుకంటే..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరునుండి విశాఖ జిల్లా వెంకటాపురం బయలు దేరారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరునుండి విశాఖ జిల్లా వెంకటాపురం బయలు దేరారు. ఈ రోజు ఉదయం విశాఖలో జరిగిన ఎల్జీ గ్యాస్ లీకేజీలో ప్రమాదాన్ని పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శిస్తారు. విశాఖ రావడానికి అనుమతి కోసం డిజీపీ గౌతం సవాంగ్ కు రాసిన లేఖకు రిప్లై రావడంతో. రాష్ట్ర  ప్రభుత్వం అనుమతి తో విశాఖ బయలుదేరారు.  కన్నా లక్ష్మీనారాయణ రోడ్డు మార్గం ద్వారా విశాఖ చేరుకుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్సగ్రేషియా ప్రకటించడాన్ని కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు.

Video Top Stories