Asianet News TeluguAsianet News Telugu

రామతీర్ధంలో ఉద్రిక్తత... విశాఖ కేజీహెచ్ లో విష్ణువర్ధన్ రెడ్డికి చికిత్స

విజయనగరం జిల్లా రామతీర్థంలో గురువారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. 

విజయనగరం జిల్లా రామతీర్థంలో గురువారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ ఘటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సొమ్మసిల్లిపడిపోయాడు. అంతేకాకుండా  బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా సొమ్మసిల్లి పడిపోగా ఆయనను విశాఖపట్నంలోని కేజీహెచ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.