Asianet News TeluguAsianet News Telugu

బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై మహిళా జేఏసీ నేతల దాడి

అమరావతిలో రధోత్సవం ముగించుకుని వెళ్తున్న ఎంపీ నందిగం సురేష్ కారును అమరావతి మండలం లేమల్లే లో మహిళా జేఏసీ నేతలు అడ్డుకున్నారు.

అమరావతిలో రధోత్సవం ముగించుకుని వెళ్తున్న ఎంపీ నందిగం సురేష్ కారును అమరావతి మండలం లేమల్లే లో మహిళా జేఏసీ నేతలు అడ్డుకున్నారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ మహిళా జేఏసీ నేతలు ముట్టడించారు. జేఏసీ నేతలు దాడికి యత్నించడంతో గన్ మెన్ ల సహాయంతో ఎంపీ అక్కడ నుండి వెళ్ళిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు జేఏసీ మహిళా సభ్యులను అరెస్ట్ చేసి అమరావతి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, విజయవాడ మాజీ మేయర్ గద్దె అనురాధ వున్నారు.