Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో రెవెన్యూ శాఖ మీద ప్రజలు తిరగబడడానికి కారణం అదే.. పిల్లి సుభాష్ చంద్రబోస్

కృష్ణా జిల్లా, పెనమలూరు రిజిస్ట్రేషన్ శాఖలో దళారీ వ్యవస్థ నిర్మూలనకే ఆటో మ్యుటేషన్ అని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

కృష్ణా జిల్లా, పెనమలూరు రిజిస్ట్రేషన్ శాఖలో దళారీ వ్యవస్థ నిర్మూలనకే ఆటో మ్యుటేషన్ అని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఇకపై ఏపీలో రిజిస్ట్రేషన్ జరిగిన గంటలోనే దస్తావేజులు ఇస్తారన్నారు. భూములు, అమ్మకాలు, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ సులభతరం చేశాం అని తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజక వర్గం లోని కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆటో మ్యుటేషన్ పైలెట్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్, రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్యలు ప్రారంభించారు.