Asianet News TeluguAsianet News Telugu

ఇండిపెండెంట్ అభ్యర్థి భర్తను.... నడిరోడ్డుపై చితకబాదిన ప్రత్యర్థులు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ బలపరచిన స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి భర్త ఆతుకూరి నాగేశ్వరావు (చినబాబు) పై దాడి కొందరు దాడికి పాల్పడ్డారు. 

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ బలపరచిన స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి భర్త ఆతుకూరి నాగేశ్వరావు (చినబాబు) పై దాడి కొందరు దాడికి పాల్పడ్డారు. నాగేశ్వరరావు ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో జాయిన్ అయ్యారు. అయితే అంతకు ముందే వైసిపి అభ్యర్థికి పోటీగా తన భార్య ఉషారాణితో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయించాడు. మారిన పరిస్థితుల నేపథ్యంలో టిడిపి అతడికి మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో ఇవాళ పోలింగ్ సరళిని పరిశీలించేందుకు భార్యతో కలిసి వెళుతున్న అతడిపై రోడ్డుపైనే పట్టుకున్న కొందరు దాడికి పాల్పడ్డారు. పోలీసులు అక్కడికి రావడంతో దాడికి పాల్పడిన దుండగులు పారిపోయారు. 

Video Top Stories