Asianet News TeluguAsianet News Telugu

మాచర్ల ఆశా వర్కర్ హత్యాచారం ఘటన... న్యాయం కోసం రోడ్డెక్కిన మహిళలు

పల్నాడు : మానవ మృగాల చేతిలో అతి దారుణంగా అత్యాచారానికి గురయి ప్రాణాలు కోల్పోయిన తోటి ఆశా వర్కర్ కోసం పల్నాడు జిల్లాలో ఆశావర్కర్లు రోడ్డెక్కారు. 

పల్నాడు : మానవ మృగాల చేతిలో అతి దారుణంగా అత్యాచారానికి గురయి ప్రాణాలు కోల్పోయిన తోటి ఆశా వర్కర్ కోసం పల్నాడు జిల్లాలో ఆశావర్కర్లు రోడ్డెక్కారు. బాధిత ఆశా వర్కర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నరసరావుపేటలో నిరసన చేపట్టారు. గత నెల మాచర్ల చెంచు కాలనీలో రమావత్ లీలావతి అనే ఆశావర్కర్ హత్యాచారానికి గురయ్యింది. ఇంత దారుణం జరిగినా ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని... ఇప్పటికయినా స్పందించి ఆర్థిక సాయంతో పాటు తగిన న్యాయం జరిగేలా చూడాలని ఆశావర్కర్లు డిమాండ్ చేసారు. ఈ మేరకు నరసరావుపేట మున్సిపల్ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు.   

Video Top Stories