Asianet News TeluguAsianet News Telugu

దొంగకు అధికారం ఇస్తే ఎలా ఉంటుందో.. జగన్ చూపిస్తున్నాడు.. సుంకర పద్మశ్రీ

విజయవాడ ఒక దొంగకి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఏపీలో పాలన అలా ఉందని మండిపడ్డారు  ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు.

విజయవాడ ఒక దొంగకి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఏపీలో పాలన అలా ఉందని మండిపడ్డారు  ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. అసెంబ్లీలో ఎటువంటి చర్చ లేకుండా, సభలో ప్రతిపక్షాలు లేకుండా అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆమోదించుకున్నారు. దొంగతనంగా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. అమరావతిని తరలించవద్దు అని ఐదు కోట్ల మంది ఆంధ్రుల చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ 
పట్టించుకోలేదు. జగన్ నిరంకుశంగా తాను అనుకున్నదే చేయాలని పట్టుదలతో మూర్ఖంగా బిల్లులను ఆమోదించుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై హైకోర్టు మొట్టికాయలు వేస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వ తీరుపై రాజధాని రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని హెచ్చరించారు.

Video Top Stories