Asianet News TeluguAsianet News Telugu

టిడిపి నేత లైంగిక వేధింపులు... మైనర్ బాలిక సూసైడ్ పై మహిళా కమీషన్ సీరియస్

అనంతపురం : సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు మైనర్ బాలిక బలయిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. 

అనంతపురం : సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు మైనర్ బాలిక బలయిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. నిందితుడు రాళ్లపల్లి ఇంతియాజ్ వేధింపులు భరించలేక సుధారాణి అనే మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమని అన్నారు. అనంతపురం జిల్లాలో టిడిపి నాయకుల వరుస అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.  గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినపుడు టిడిపి సీరియస్ గా స్పందించివుంటే తిరిగి ఇలాంటివి పునరావృతం అయ్యేవి కాదని... ఆలోచించమని చంద్రబాబు మహిళా కమీషన్ తరపున సూచన చేస్తున్నానని పద్మ అన్నారు. విజయవాడలో వినోద్ జైన్ ఉదంతం, టిడిపి కార్యాలయంలో లోకేష్ పిఏ అఘాయిత్యం మహిళ ఆరోపణలపై టిడిపి కఠినంగా వ్యవహరించాల్సిందని అన్నారు. కానీ 
ఇలాంటి ఘటనలపై చంద్రబాబు స్పందన సరిగ్గా లేదన్నారు. టీడీపీ నేతల వేధింపులకు కారణం చంద్రబాబు వెనుకేసుకురావడమే అని అన్నారు. ఇలాంటి ఘటనలను మహిళా కమిషన్ సహించే ప్రసక్తే లేదని... కీచక టీడీపీ నేతలకు తగిన గుణపాఠం తప్పదని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.