Asianet News TeluguAsianet News Telugu

కౌలు రైతులకు రుణాలను అందించేలా...: నాబార్డ్ ఛైర్మన్ తో కన్నబాబు భేటీ

రాష్ర్టంలోని బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాలను అందించేలా చర్యలు తీసుకోవాలని  వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. 

రాష్ర్టంలోని బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాలను అందించేలా చర్యలు తీసుకోవాలని  వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. ప్రాధమిక రంగాల అభివృద్ధి, రైతుల ఆర్థిక ప్రయోజనాలు తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ మరియు ఇతర అనుబంధ రంగాలకు సంబంధించిన వివిధ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం  అమలు చేస్తోందన్నారు. నాబార్డు రాష్ట్ర ప్రగతికి ఎంతగానో సహాయ పడుతుందన్నారు. ఈ సందర్భంగా, నాబార్డు చైర్మన్ గోవింద రాజులుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.