Asianet News TeluguAsianet News Telugu

Video: విట్‌‌లో రిపబ్లిక్ డే వేడుకలు: పాల్గొన్న హైకోర్టు జడ్జి జస్టిస్ శివకుమార్

ఐనవోలు విట్ యూనివర్సిటీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఐనవోలు విట్ యూనివర్సిటీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ శివకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం డ్యూటీలో ఉండగా గుండెపోటుతో మరణించిన గిద్దలూరుకు చెందిన గురవయ్య కుటుంబానికి విట్ వర్సిటి తరపున 25,000 ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. అలాగే కచ్చులూరు లాంచీ బోటు ప్రమాదంలో 37 మందిని  కాపాడిన 25 మంది జాలర్లకు విట్ యూనివర్సిటీ ఒక్కొక్క జాలరికి ప్రకటించిన 25000 నగదు పురస్కారాన్ని శివకుమార్ అందజేశారు. అలాగే ఇదే ప్రమాదంలో సాహసం కనబరిచిన పోలీస్ సిబ్బంది ఒక్కొక్కరికి రూ.25,000 నగదు పురస్కారాన్ని అందించారు.