ఏపీలో ఘనంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు
రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ జె.కె. మహేశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహానీ, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్,సిపి ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరుగుతున్న వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింభించేలా శకటాలు ప్రదర్శించారు.