Asianet News TeluguAsianet News Telugu

ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించేలా చూడండి... నీలం సాహ్ని

దేశ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోను నమోదవుతున్న కరోనా కేసుల్లో 70శాతం వరకూ కేసులు పట్టణ ప్రాంతాల్లోనే నమోదు అవుతున్న నేపధ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు పట్టణాల్లో   ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు.

దేశ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోను నమోదవుతున్న కరోనా కేసుల్లో 70శాతం వరకూ కేసులు పట్టణ ప్రాంతాల్లోనే నమోదు అవుతున్న నేపధ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు పట్టణాల్లో   ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు.పట్టణ ప్రాంతాల్లో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె జిల్లా కలెక్టర్లు,మున్సిపల్ కమీషనర్లు,పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు,ఇతర వైద్యాధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి నియంత్రణకు పట్టణాల్లోని ప్రైమరీ,సెకండరీ సర్వెలెన్స్ అండ్ మానిటరింగ్ బృందాలు సమర్ధ వంతంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు.ప్రతి వార్డు సచివాలయాన్ని ఒక పట్టణ ఆరోగ్య కేంద్రంతో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు.