Asianet News TeluguAsianet News Telugu

పొట్టి శ్రీరాములు, వల్లభాయ్ పటేల్ వర్ధంతి... నివాళి అర్పించిన సీఎం జగన్

అమరావతి : ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించినవారు ఒకరు... 

First Published Dec 15, 2022, 3:52 PM IST | Last Updated Dec 15, 2022, 3:52 PM IST

అమరావతి : ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించినవారు ఒకరు... నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విముక్తి కలిగించినవారు మరొకరు. ఇలా తెలుగు ప్రజల కోసం పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములు, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ల వర్ధంతి నేడు. ఈ సందర్భంగా శ్రీరాములు, పటేల్ చిత్రపటాలకు పూలు సమర్పించి నివాళి అర్పించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ వర్ధంతి కార్యక్రమం జరిగింది.