Asianet News TeluguAsianet News Telugu

మీ నాయకత్వంలో దేశ భవిష్యత్తు భద్రం.. ప్రధాని మోదీతో సీఎం జగన్

భారత్- చైనా సరిహద్దు ప్రాంతం గాల్వన్‌ వద్ద సంక్షోభ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సరైన మార్గంలో విజయవంతగా నడిపిస్తారని నమ్ముతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్ది తెలిపారు.

భారత్- చైనా సరిహద్దు ప్రాంతం గాల్వన్‌ వద్ద సంక్షోభ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సరైన మార్గంలో విజయవంతగా నడిపిస్తారని నమ్ముతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్ది తెలిపారు. భారత్‌- చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చైనాతో జరిగిన ఘర్షణలో మరణించిన 20 మంది వీరసైనికుల మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని ప్రధాని మోదీకి సీఎం జగన్ చెప్పారు.