Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం జగన్, సతీమణి భారతి

గుంటూరు: కరోనా వ్యాక్సిన్ పై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగించడానికి స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనే రంగంలోకి దిగారు. 

గుంటూరు: కరోనా వ్యాక్సిన్ పై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగించడానికి స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనే రంగంలోకి దిగారు. సతీమణి భారతితో కలిసి సీఎం జగన్ గురువారం కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారు. గుంటూరు పట్టణంలోని భారత్‌పేట 6వ లైన్‌లోని 140వ వార్డు సచివాలయంలో కరోనా టీకా తీసుకొన్నారు. వ్యాక్సిన్ వేసుకొన్న తర్వాత జగన్ దంపతులు అరగంటపాటు అబ్జర్వేషన్ లో ఉన్నారు. 45 ఏళ్లు దాటినవారికి కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో తొలుత సీఎం వైఎస్ జగన్  రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు.