Asianet News TeluguAsianet News Telugu

36వ రోజుకు మహాధర్నా : రాజధాని గ్రామాల్లో స్వచ్ఛందంగా బంద్

రాజధాని ని అమరావతి నుండి తరలించవద్దు అంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 36 వ రోజుకు చేరుకున్నాయి.

రాజధాని ని అమరావతి నుండి తరలించవద్దు అంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 36 వ రోజుకు చేరుకున్నాయి. తుళ్ళూరు, మందడం గ్రామాల్లో మహాధర్నా నిర్వహిస్తున్నారు. వెలగపూడిలో 36 వరోజు రిలేనిరాహారదీక్ష చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి పిలుపు మేరకు రాజధాని గ్రామాల్లో వ్యాపారులు స్వచ్చందంగా దుకాణాలు మూసివేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపద్యంలో రాజధాని గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మందడం గ్రామంలో ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా వ్యాపారస్తులు స్వచ్చందంగా బందు పాటిస్తున్నారు.