Asianet News TeluguAsianet News Telugu

శ్వాస ఆడుతుందా?.. ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆరా తీసిన మంత్రులు..

గ్యాస్ లీకేజి ఘటన లో గాయపడిKGH లో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం రాష్ట్ర మంత్రులు పరామర్శించారు.

గ్యాస్ లీకేజి ఘటన లో గాయపడిKGH లో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాసరావు, జిల్లా ఇన్ చార్జ్ మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కార్మిక శాఖ మంత్రి గుమ్మలూరి జయరాం, రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాసు, పార్లమెంటు సభ్యులు బివి సత్యవతి, శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. ముందుగా చిన్న పిల్లల వార్డులో ఉన్న వారిని పరామర్శించి శ్వాస సరిగా ఆడుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు.