కర్నూలు జిల్లాలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు.. వేలలీటర్ల నాటుసారా పట్టివేత...
పెద్ద ఎత్తున నాటుసారా కాస్తున్నారన్న సమాచారంతో కర్నూలు జిల్లా అవుకు మండలం గడ్డమేకలపల్లె గ్రామంపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఐపీఎస్ అధికారి గౌతమి శాలి ఆధ్వర్యంలో లో 30 మంది ప్రత్యేక పోలీవ్సు బృందం దాడులు నిర్వహించారు.
పెద్ద ఎత్తున నాటుసారా కాస్తున్నారన్న సమాచారంతో కర్నూలు జిల్లా అవుకు మండలం గడ్డమేకలపల్లె గ్రామంపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఐపీఎస్ అధికారి గౌతమి శాలి ఆధ్వర్యంలో లో 30 మంది ప్రత్యేక పోలీవ్సు బృందం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎనిమిది వేల లీటర్ల బెల్లం ఊట 600 లీటర్ల నాటుసారా, నాటుసారా తయారీకి ఉపయోగించే మూడువందల కేజీల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. అవుకు మండలం లోని గడ్డమేకలపల్లె నాటు సారా తయారీ అడ్డాగా మారింది. వీరికి రాజకీయ అండదండలు ఉండడంతో నాటు సారా తయారీ యథేచ్ఛగా సాగుతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ఇసుక నాటుసారా ను అరికట్టాలని ఉద్దేశంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. 7993822444 కు వాట్సాప్ ద్వారా అక్రమ ఇసుక రవాణా నాటుసారా రవాణా సంబంధించి సమాచారాన్ని చేర వేయొచ్చని గౌతమి శాలి తెలిపారు.