Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రాకు వెళ్లకుండా వెనుదిరిగిన విద్యార్థులు..కారణమిదే...

కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట గరికపాడు చెక్ పోస్టు వద్ద పడిగాపులు కాస్తున్న విద్యార్థులు, ప్రయాణికులను ఆంధ్రా పోలీసులు ఎట్టకేలకు వెనక్కు పంపించారు. 

కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట గరికపాడు చెక్ పోస్టు వద్ద పడిగాపులు కాస్తున్న విద్యార్థులు, ప్రయాణికులను ఆంధ్రా పోలీసులు ఎట్టకేలకు వెనక్కు పంపించారు. ఆంధ్రప్రదేశ్ లోకి రావాలంటే నూజివీడు ఐఐఐటీలో 14 రోజులు ఉండాలని అధికారులు ఆంక్షలు విధించారు. సుమారు 100మంది విద్యార్థులు ఐఐఐటీ లో ఉండేందుకు అంగీకరించారు. కర్ఫ్యూ కారణంగా ఇకపై ఎవ్వరూ హైదరాబాద్ నుండి రావద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మరికొంతమంది తిరిగి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే వీరికి వాహనాలు లేకపోవడంతో చెక్ పోస్టు వద్ద పడిగాపులు పడుతున్నారు. 

Video Top Stories