Asianet News TeluguAsianet News Telugu

విశాఖ గ్యాస్ లీకేజ్ పై హై పవర్ కమిటీ.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖలో ఉన్న సీఎస్, కలెక్టర్ వినయ్‌చంద్, సీపీ మీనాలతో మాట్లాడారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సీఎస్ సీఎంకు వివరించారు. గ్యాస్ లీకేజ్ నివారణకు తీసుకుంటున్న చర్యల్ని జగన్‌కు కలెక్టర్ వివరించారు. బాధితులకు ప్రకటించిన సాయాన్ని వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.