Asianet News TeluguAsianet News Telugu

అఖిలపక్ష బంధ్ లో చంద్రబాబు ప్లెక్సీ... వైసిపి, టిడిపి నేతల ఘర్షణ

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఇవాళ(శుక్రవారం) ఆంధ్ర ప్రదేశ్ బంధ్ చేపడుతున్న విషయం తెలిసిందే. 

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఇవాళ(శుక్రవారం) ఆంధ్ర ప్రదేశ్ బంధ్ చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా కృష్ణా జిల్లా కైకలూరులో చేపట్టిన బంధ్ ఉద్రిక్తంగా మారింది. నిరసన కార్యాక్రమంలో పాల్గొన్న వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. టీడీపి బ్యానర్ లో చంద్రబాబు బొమ్మ గొడవకు కారణమని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అన్ని పార్టీలు కలిసి చేస్తున్న బంధ్ లో  బాబు బొమ్మతో కూడిన ప్లేక్సీని ఎలా పెడతారంటూ వైసీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది.