Asianet News TeluguAsianet News Telugu

వలస కష్టాలు తీరినట్టే.. 887మంది మత్స్యకారులు సొంతగూటికి..

గారికాపాడు చెక్ పోస్ట్ వద్ద ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, జిల్లా SP రవీంద్రనాథ్ లు గుజరాత్ నుండి 12 బస్సుల్లో రాష్ట్రానికి చేరిన 887 మంది మత్స్యకారులకు స్వాగతం పలికారు. 

గారికాపాడు చెక్ పోస్ట్ వద్ద ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, జిల్లా SP రవీంద్రనాథ్ లు గుజరాత్ నుండి 12 బస్సుల్లో రాష్ట్రానికి చేరిన 887 మంది మత్స్యకారులకు స్వాగతం పలికారు. ఇందులో శ్రీకాకుళం 700 మంది,  విజయనగరం 98 మంది, విశాఖపట్నం 77 మంది,  తూర్పుగోదావరి ఐదుగురు, ఒడిశా రాష్ట్రం ఆరుగురు, చత్తీస్గడ్ నుండి ఒకరు ఉన్నారు. వీరందరికీ ఆరోగ్యపరీక్షలు చేసి కరోనా అనుమానం ఉంటే క్వారంటైన్ కు లేదంటే ఇంటికి పంపించి హోం క్వారంటైన్ ఉండమని చెబుతామన తెలిపారు.