Asianet News TeluguAsianet News Telugu

సోమవారం నుండి రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు..

మే 17వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాలతో  సిబ్బంది అప్రమత్తమయ్యారు.

మే 17వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాలతో  సిబ్బంది అప్రమత్తమయ్యారు. కరోణా వైరస్ కు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజా రవాణాను అందుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులు కొత్త రూపు ను సంతరించుకొనున్నాయి. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పెంచేలా బస్సులను ఆల్టరేషన్ చేశారు. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ ,ఎక్స్ప్రెస్,పల్లె వెలుగు బస్సులను వాటి వాటి నిర్మాణానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. ముఖానికి మాస్కు ఉంటేనే బస్సులోకి అనుమతిస్తామని, బస్సులను తమ సంస్థ స్వయంగా తయారుచేసిన సానీ టైజర్ల ద్వారా శుభ్ర పరుస్తామన్నారు. పూర్తిగా మనీ లెస్ కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామంటున్నారు కర్నూలు ఆర్టీసీ అధికారులు.