Asianet News TeluguAsianet News Telugu

కరోనాఎఫెక్ట్ : నేటినుండి మహానంది ఆలయంలో అన్ని సేవలూ రద్దు

కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రముఖ శైవ క్షేత్రం మహానంది దేవాలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. 

కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రముఖ శైవ క్షేత్రం మహానంది దేవాలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. కరోనా నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖా ఆదేశాల మేరకు  నేటి నుండి అన్ని రకాల ఆర్జిత సేవలు, గర్భాలయా ప్రవేశాలను పూర్తిగా రద్దు చేశారు. కొనేర్లల్లో స్నానాలు నిలిపివేశారు. కేవలం ఆలయ అర్చకులు, పండితులు మాత్రమే శాస్త్ర ప్రకారం చేయవలసిన అన్ని సేవలు నిర్వహిస్తారని ఆలయ కార్యానిర్వహనాధికారి మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. భక్తులెవరూ మహానంది క్షేత్రమునకు రావద్దు అని, ఇది  భక్తుల ఆరోగ్యం కొరకు తీసుకున్న చర్య మాత్రమే అని తెలిపారు.