కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమంది పరిస్థితి విషమం... (వీడియో)
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డోన్ నేషనల్ హైవే రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా లారీ ఆటో ఢీ కొన్న ఘటనలో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒక చిన్నారి, ఇంకా ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరందరూ మల్లంపల్లె గ్రామానికి చెందిన పొదుపు గ్రూపు మహిళలు. గ్రామం నుండి డోన్ స్టేట్ బ్యాంకుకు వచ్చే సమయంలో ఈ ఘోరం జరిగింది.