Asianet News TeluguAsianet News Telugu

కృష్ఱా జిల్లా కోర్టులో ఏసిబి దాడులు... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఎక్సైజ్ కోర్ట్ ఏపిపి

మచిలీపట్నం : క‌ృష్ణా జిల్లా కోర్టులో ఏసిబి దాడులు కలకలం రేపాయి.  

మచిలీపట్నం : క‌ృష్ణా జిల్లా కోర్టులో ఏసిబి దాడులు కలకలం రేపాయి.  అవినీతి నిరోదక శాఖ అధికారులు రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా ఎక్సైజ్ కోర్ట్ ఏపిపి విజయలక్ష్మి, కానిస్టేబుల్ బాలకృష్ణ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత నేతృత్వంలో డీఎస్పీలు శ్రీనివాస్, శరత్ లతో కూడిన బృందం ఈ దాడులు చేపట్టింది. 498ఏ కేసులో మురళీకృష్ణను ఎపిపి విజయలక్ష్మి లంచం డిమాండ్ చేసింది. దీంతో అతడు ఏసిబిని ఆశ్రయించాడు. ఏపిపి విజయలక్ష్మి సూచించినట్లు రూ.90వేల నగదును కానిస్టేబుల్ బాలకృష్ణకు అందిస్తుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏపిపి విజయలక్ష్మితో పాటు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసిబి ఎఎస్పీ స్నేహిత తెలిపారు. 

Video Top Stories