Asianet News TeluguAsianet News Telugu

మందడం శిబిరంలో పచ్చకండువా ధరించి... అమరావతి ఉద్యమానికి చంద్రబాబు మద్దతు

గుంటూరు : వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధానిని అమరాతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మహిళలు, రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. 

First Published Jul 18, 2022, 2:02 PM IST | Last Updated Jul 18, 2022, 2:02 PM IST

గుంటూరు : వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధానిని అమరాతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మహిళలు, రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రాజధాని ఉద్యమానికి తాజాగా టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు మరోసారి మద్దతుగా నిలిచారు. అసెంబ్లీలో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్న చంద్రబాబు తిరిగివెళుతూ తుళ్ళూరు మండలం మందడం శిబిరం వద్ద ఆగారు. ఆయనకు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు.  అమరావతి రైతులు ఇచ్చిన ఆకుపచ్చ కండువాను చంద్రబాబు మెడలో ధరించారు.